న్యూఢిల్లీ: బంగారం, వెండితో పాటు విలువైన లోహాలపై దిగుమతి సంకాన్ని కేంద్రం పెంచింది. ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతంగా ఉంది. దానిని 15శాతానికి పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పెరిగిన దిగుమతి సుంకం సోమవారం(జనవరి 22) నుంచి అమలులోకి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ ను జారీ చేసింది.
Also Read.. పనులు చేస్తుండగా దూసుకెళ్లిన ట్రైన్.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి!
ఇదిలా ఉండగా.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800లు ఉండగా.. 24 క్యారెట్లబంగారం రూ.63,050 వద్ద ఉంది.