Saturday, May 18, 2024

బాతు గుడ్లు పెట్టిన రూట్.. దెబ్బకు దెబ్బ కొట్టిన టీమిండియా ఫ్యాన్స్

spot_img

వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. టీమిండియా టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ తప్ప మరే ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. విరాట్ కోహ్లి డకౌట్ కావడంతో ఏకనా స్టేడియం మొత్తం నిరాశ చెందింది. అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ల ఇన్నింగ్స్ కారణంగా టీమ్ ఇండియా ఇప్పటికీ గౌరవప్రదమైన స్కోరును చేరుకుంది.

విరాట్ కోహ్లీ డకౌట్ అయిన తర్వాత, ఇంగ్లీష్ అభిమానులు సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడం ప్రారంభించారు. వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ తొలిసారి డకౌట్ అయ్యాడు. ఇంగ్లీష్ అభిమానులకు అవకాశం వచ్చింది. తమ సోషల్ మీడియాలో కోహ్లి ఫొటోను ఎడిట్ చేసి డక్ గా చూపించారు.

 

ఇంగ్లీషు అభిమానుల ఈ ట్వీట్‌ని ఇండియన్స్ భరించలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాను పునరాగమనం చేసేలా చేసారుజ ఈ సమయంలో బుమ్రా జో రూట్‌ను, మహ్మద్ షమీ బెన్ స్టోక్స్‌ను డకౌట్ చేశారు. ఇండియా ఫ్యాన్స్ రివేంజ్ తీర్చుకున్నారు. సోషల్ మీడియాలో ఇంగ్లండ్ జట్టును ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జో రూట్ గోల్డెన్ డకౌట్ చేయగా, బెన్ స్టోక్స్ 10 బంతుల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. వారి ముఖాలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. కొహ్లీని ఎగతాళి చేసిన ఇంగ్లండ్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.

 

 

 ఇది కూడా చదవండి: బుమ్రా, షమి.. వారెవ్వా.. ఇంగ్లండ్ ఢమాల్.. తుస్సుమన్న టాపార్డర్!

Latest News

More Articles