హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యంవైపు దూసుకెళ్తుంది. కేఎల్ రాహుల్ 86 (123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా 81 నాటౌట్ ( 155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కదం తొక్కారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది.
Also Read.. తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే
టీమిండియా 175 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 119/1తో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా… తొలి సెషన్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(80), శుభ్మన్ గిల్(23) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హర్ట్లే, జో రూట్ 2 వికెట్ల చొప్పున తీశారు.
Stumps on Day 2 in Hyderabad! 🏟️#TeamIndia move to 421/7, lead by 175 runs 🙌
See you tomorrow for Day 3 action 👋
Scorecard ▶️ https://t.co/HGTxXf8b1E#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/sul21QNVgh
— BCCI (@BCCI) January 26, 2024