Saturday, May 11, 2024

తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే

spot_img

తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగింది.

Read Also: నిందితుడికి వారెంట్ ఇవ్వడానికి వెళ్లి.. బాలికపై అత్యాచారయత్నం చేసిన కానిస్టేబుల్

ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాగా.. నాడైనా.. నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో.. పార్లమెంటు ఉభయ సభల్లో పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను, చర్చించాల్సిన విధానాలపై అధినేత కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావులతో పాటు రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కే. కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీలు… రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డిలు పాల్గొన్నారు.

Latest News

More Articles