Saturday, April 27, 2024

నిందితుడికి వారెంట్ ఇవ్వడానికి వెళ్లి.. బాలికపై అత్యాచారయత్నం చేసిన కానిస్టేబుల్

spot_img

హత్య కేసులో బెయిల్‌పై వచ్చి తప్పించుకు తిరుగుతున్న నిందితుడికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడానికి వెళ్లిన కానిస్టేబుల్.. ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని తన అత్తను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. కోర్టు వాయిదాలకు హాజరు కావటం లేదు. దాంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంటును జారీ చేయగా.. వారెంటును అప్పగించేందుకు కానిస్టేబుల్ మహేష్ గుండారం గ్రామానికి వెళ్లాడు. కానీ, ఆ నిందితుడు అప్పటికే తన ఇంటిని వేరే వారికి అమ్మేసి పరారయ్యాడు.

కాగా, ఆ ఇంటిని మహారాష్ట్రకు చెందిన కుటుంబం కొనుగోలు చేసింది. కానిస్టేబుల్ వెళ్లే సమయానికి ఆ ఇంట్లో ఓ మైనర్ బాలిక మాత్రమే ఉంది. అదే అదునుగా భావించిన అతను ఆ బాలికను మాయమాటలతో లోబర్చు కునే యత్నం చేశాడు. డబ్బు ఆశ చూపి అసభ్యంగా ప్రర్తించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించి, తన ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ చేయాలని వెళ్ళిపోయాడు. పని నిమిత్తం బయటకు వెళ్లిన బాలిక తల్లదండ్రులు ఇంటికి రాగా.. ఆ బాలిక తన తండ్రితో ఈ విషయాన్ని రోదిస్తూ చెప్పింది. బాలిక తండ్రి నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు కానిస్టేబుల్ మ‌హేశ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు.

Read also: విడాకులు తీసుకుంటాం అని ఎవరూ పెళ్లి చేసుకోరు.. విడాకులపై తొలిసారి నిహారిక

Latest News

More Articles