Saturday, May 18, 2024

వర్షంతో రద్దైన ఇండియా-ఇంగ్లండ్ వార్మ‌ప్ మ్యాచ్

spot_img

ఇంగ్లండ్ తో టీమిండియా వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. గౌహ‌తిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం జ‌రిగే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే వర్షం కారణంగా మైదానాన్ని కవర్లతో కప్పివేశారు. మూడు సార్లు అంపైర్లు పిచ్ ను త‌నిఖీ చేశారు. వ‌ర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మైదానం అంతా చిత్త‌డిగా మారింది. చివ‌ర‌కు మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్రకటించారు నిర్వాహకులు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లు ఆరిపోయే దీపాలే

Latest News

More Articles