ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రేపటికి వాయిదా పడింది. అహ్మదాబాద్ లో వర్షం ఎంతకు తగ్గకపోవడంతో పరిస్థితులను పరిశీలించిన మ్యాచ్ రిఫరీ, అంపైర్లు మ్యాచ్ ను రిజర్వ్ డేకు వాయిదా వేయాలని నిర్ణయించారు.
వరుణుడు తెరిపినివ్వకపోవడంతో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనున్న ఫైనల్ మ్యాచ్ రేపు సాయంత్రం 7.30 గంటలకు జరుగనుంది. ఒకవేళ రేపు కూడా ఫైనల్ మ్యాచ్ నిర్వాహణ సాధ్యంకాకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ను విజేతగా ప్రకటించనున్నారు.