Tuesday, May 7, 2024

టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు..!

spot_img

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్ గా పని చేస్తున్న రమేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ ఘటనలో ఇప్పటికే విద్యుత్ శాఖలోని రవికిషోర్ అనే ఉద్యోగిని సిట్ అదుపులోకి తీసుకొని విచారించింది. రమేష్ ప్రశ్నా పత్రాలను ఇరవై మందికి అమ్మినట్టుగా విచారణలో సిట్ అధికారులు గుర్తించారు. రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిట్ అధికారులు తెలిపారు.

Latest News

More Articles