Saturday, May 18, 2024

గాజా ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎమర్జెన్సీ వార్నింగ్

spot_img

గాజాపై ఇజ్రాయెల్‌ మరింత ముమ్మరం దాడులు చేస్తోంది. తాజాగా గాజా నివాసితులను ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపునకు వెళ్లాలని అల్టిమేటం జారీ చేసింది. అలా వెళ్లని వారిని ఉగ్రవాద సానుభూతిపరులుగా పరిగణిస్తామని పేర్కొంది.

Also Read.. చైనా వద్ద 500 అణువార్‌హెడ్‌లు!

ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేశారు. త్వరలోనే ఇజ్రాయెల్‌ ఆర్మీ భూతల దాడులకు సన్నద్ధం అవుతోంది. దీని కోసం ఇప్పటికే గాజా సరిహద్దులో సైనిక దళాలు, ట్యాంకులు, ఆయుధాలను భారీగా మోహరించింది ఇజ్రాయెల్.

Latest News

More Articles