ఏపీ: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారుల తనిఖీలలో భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. నాలుగు బంగారం దుకాణాల్లో బిల్లులు లేని సుమారు 300 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
Also Read.. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హైడ్రామా
ప్రొద్దుటూరులోని బుశెట్టి జువెలర్స్, డైమండ్స్ దుకాణాలతో పాటు గురురాఘవేంద్ర, తల్లం దుకాణాల్లో నాలుగు రోజులుగా తనిఖీలు చేపట్టారు. సీజ్ చేసిన బంగారాన్ని అట్టపెట్టెలు, సూట్కేసుల్లో భద్రపరిచి వాహనాల్లో తిరుపతికి తరలించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి బిల్లులు లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు తనిఖీల సందర్భంగా గుర్తించారు.