భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హైడ్రామా జరిగింది. మగ శిశువుకి బదులుగా ఆడ శిశువును అందించారని శిశువు తండ్రి, బంధువులు ఆసుపత్రిపై ఆరోపించారు. వివరాల్లోకి వెళితే..దుమ్ముగూడెం మండలం కాటాయి గూడెం గ్రామానికి చెందిన ఉష… నిన్న రాత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శిశువుకి జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఆసుపత్రిలో శిశువు మారినట్లు వస్తున్న వార్తలలో నిజం లేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.