Friday, May 17, 2024

లక్ష్యం దిశగా ఆదిత్య-ఎల్‌1.. ఇస్రో మరో ముందడుగు..!!

spot_img

బెంగళూరు : అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. తాజాగా చేపట్టిన మూడో భూ కక్ష్య పెంపు ప్రక్రియ విజయవంతం అయింది. ప్రస్తుతం 296 x 71,767 కిలో మీటర్ల కక్ష్యలో ఆదిత్య-ఎల్‌1 శాటిలైట్‌ తిరుగుతున్నదని ఇస్రో ట్వీట్ చేసింది. తదుపరి భూ కక్ష్య పెంపు ప్రక్రియ ఈనెల 15న నిర్వహించనున్నట్లు తెలిపింది. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య-ఎల్‌1 ను ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే.

Latest News

More Articles