ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ తమ తమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ ప్రచారంలో వేగం పెంచారు. దాంతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.
Read Also: సచిన్ రికార్డులు బద్దలుకొట్టిన కోహ్లీ
ఏం చేయలేని కేంద్రంలోని బీజేపీ.. బీఆర్ఎస్ నాయకులపై ఐటీ దాడులు చేయిస్తోంది. తాజాగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంటిపై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దాదాపు 40 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్తో పాటు నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఒక్క నల్గొండలోనే 30 బృందాలతో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.