హైదరాబాద్ లోని ఓ ప్రముఖ నిర్మాత ఇంట్లో జరుగుతున్న ఐటీ దాడులు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపాయి. త్వరలోనే ఆయన నిర్మించిన సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ సమయంలో ఈ దాడులు అందరినీ ఆలోచనలో పడేశాయి.
Read Also: భారత మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది షాహిద్ లతీఫ్ హత్య
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో, కార్యాలయంలో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఐటీ బృందం అభిషేక్ కార్యాలయంలో సోదాలు జరుపుతోంది. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన టైగర్ నాగేశ్వరరావు త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర నిర్మాతపై ఐటీ దాడులు జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యానర్లో మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న విడుదల కానుంది. అభిషేక్ అగర్వాల్ గతేడాది బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించాడు. కశ్మీర్ ఫైల్స్ సీక్వెల్ ది ఢిల్లీ ఫైల్స్, కార్తికేయ 2, ధమాకా చిత్రాలన్నీ ఈయన బ్యానర్ నుంచి వచ్చినవే కావడం గమనార్హం.
Read Also: బాయ్ఫ్రెండ్తో బెడ్ మీద ఉండగా చూశారని చెల్లెళ్లని చంపేసిన అక్క