Saturday, May 4, 2024

జగన్ పెద్ద శాడిస్ట్..హీరోలను చూస్తే కుళ్లు.!

spot_img

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ది శాడిస్ట్ మనస్తత్వం అన్నారు. ఎవరికి పేరు వచ్చినా జగన్ తట్టుకోలేరని..చిత్ర పరిశ్రమను కూడా రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశారని పవన్ ఆరోపించారు. లక్షలాది మంది అభిమానులు ఉన్న సినిమా హీరోలంటే జగన్ కు కుళ్లు అని..అందరు సినీహీరోల అభిమానులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా టికట్ల ధరల విషయం గురించి సీఎం జగన్ తో మాట్లాడేందుకు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్ వెళితే వారిని అగౌరవపర్చారంటూ ఆరోపించారు.

ప్రైవేటుగా మీటింగు జరుగుతుంటే శాడిస్టిక్ గా సీక్రెట్ కెమెరాలు, మైకులు పెట్టారంటూ ఫైర్ అయ్యారు. చిరంజీవి అందరి తరపున మాట్లాడితే..ఆ వీడియోలను బయటకు విడుదల చేసి అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమాన హీరోలను కూడా గేటు దగ్గర నుంచి నడిపించారని కనీసం భోజనంకూడా పెట్టుకుండా కించపరిచి ఆనందం పొందిన వ్యక్తి జగన్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది అభిమానుల గుండెల్లో పెట్టుకునే హీరోలంటే జగన్ కు ఒక రకమైన కుళ్లు అన్నారు. ముఖ్యంగా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ అన్నారు.

ఇది కూడా చదవండి: రాష్ట్ర బీజేపీలో ఏం జరుగుతోంది..ఆ నలుగురికీ బీ-ఫామ్స్ కట్?

Latest News

More Articles