Friday, May 17, 2024

భక్తులతో కళకళలాడుతున్న జగన్నాథ ఆలయాలు

spot_img

హైదరాబాద్: దేశవ్యాప్తంగా జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానుంది. జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో జగన్నాథుని ఆలయాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. పూరీ, అహ్మదాబాద్‌లలోని ప్రతిష్ఠాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాలలో జగన్నాథుని రథయాత్ర జరుగనుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శుక్ల పక్షం రెండో రోజున జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. పూరీలో జరిగే రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడంవల్ల అన్ని తీర్థయాత్రల చేసిన ఫలాలు లభిస్తాయని విశ్వాసం.

Latest News

More Articles