జగిత్యాల: వ్యవసాయ బావి మోటర్లు ఎత్తుకెళ్తున్న దొంగలను రైతులు పట్టుకున్నారు. ఇటీవల జగిత్యాలలో వరుస చోరీలు జరుగుతున్నాయి. వందలాది వ్యవసాయ బావి మోటార్లు దుండగులు ఎత్తుకెళ్లారు. లక్షలు విలువ చేసే మోటార్లు ఎత్తుకెళ్లడంతో పంటలు ఎండిపోయాయని రైతులు తెలిపారు. దీంతో కాపు కాసి దొంగలను పట్టుకొని రైతులు చితకబాదారు. అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.