Thursday, May 2, 2024

కాంగ్రెస్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తోంది

spot_img

సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి మండలం కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలు నున్న వీరమ్మ, నున్న మహేష్, శ్రవణ్, సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి నియోజకవర్గంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రక్తుపుటేరులు పారిన చోట గోదావరి జలాలు తెచ్చి బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ తిరిగి ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

Also Read.. లిఫ్ట్ ఇస్తే రేప్ కేసు…హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కిలాడీ లేడీ అరెస్ట్

బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన వారిని, 6 గ్యారంటీల అమలు పై ప్రశ్నించిన వారిని టార్గెట్ చేసి కాంగ్రెస్ దాడులు చేస్తోంది. కాంగ్రెస్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు , ప్రభుత్వం , ముఖ్యమంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలి. దాడులను ఆదిలోనే అరికట్టండి లేకుంటే పరిస్థితి చేయి దాటుతుంది. 10 సంవత్సరాల పాలనలో అభివృద్ధే అజెండాగా పని చేశామన్నారు.

కాంగ్రెస్ నేతలు చిల్లర పనులు మానేసి 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలి. అమలు చేతకాకపోతే లెంపలేసుకుని పక్కకు తొలగాలి. ఓటుకు నోటు దొంగ ప్రస్తుత సీఎం రేవంత్.. కేసీఆర్‌ని ఎన్ని మాటలన్నా ప్రతీకార చర్యలకు మేము పాల్పడలేదు. వ్యక్తిగతంగా ఎన్ని మాటలన్నా తాము అభివృద్ధి తోనే సమాధానమిచ్చాం. ఓటుకి నోటు దొంగకు అధికారమిస్తే దొంగకు తాళం ఇచ్చినట్లైంది. నోటికొచ్చినట్లు హామీలిచ్చి అవి నెరవేర్చలేక ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులు అధైర్య పడొద్దని, అండగా ఉంటానన్నారు. ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేరే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు.

 

Latest News

More Articles