జైన్ సమాజ్ సేవలు సమాజానికెంతో మేలు చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే ఉద్దేశంతో జైన్ సమాజ్, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో ఈవెనింగ్ క్లినిక్ ప్రారంభించారు. మంత్రి తలసాని ఈ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ఓ వ్యక్తి, సంస్థ ఎవరరైనా సరే వారికి సామాజిక సేవా కార్యక్రమాలతోనే ప్రజాదరణ లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత సమాజంలోని పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు. పేదల కోసం ఉచితంగా వైద్య సేవలు ప్రారంభించిన జైన్ సమాజ్, కిమ్స్ హాస్పిటల్ వారికి మంత్రి తలసాని అభినందనలు తెలిపారు.