ఖమ్మం: శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేయడం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలానికి చెందిన శ్రీచైతన్య.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది.
ఈరోజు కాలేజీ బిల్డింగ్ మూడో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకి యత్నించింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.
సహ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేయడంతో భయంలో మరో ఇద్దరు విద్యార్థినిలు భయంతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు వర్ష , ప్రియాంకలు డైమింగ్ హాల్ లో స్పృహతప్పి పడిపోయారు. ఈ ఘటనతో మిగతా విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు.