Tuesday, May 21, 2024

పెళ్లి కావడం లేదని రైలు నుండి దూకి యువతి ఆత్మహత్య!

spot_img

ఖమ్మం: పెళ్లి కావడం లేదని ఓ యువతి రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు కి చెందిన పి.సంధ్యాదేవి (29) కి కుటుంబ సభ్యులు ఎన్ని పెళ్ళి సంబంధాలు చూస్తున్నా లావుగా ఉన్న కారణంగా పెళ్లి జరగడం లేదు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి.. విజయవా లో ఇంటర్సిటి ట్రైన్ ఎక్కి ఖమ్మం సమీపంలోని అగ్రహారం వద్దకు రాగానే తన సెల్ ఫోన్ ను సీటుపై పెట్టి రైలు నుండి దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.

Latest News

More Articles