న్యూఢిల్లీ: ఈ నెల 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆరోజున కేంద్ర ప్రభుత్వం ‘హాఫ్ హాలిడే’ ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొంది. రామ్లల్లా ప్రాణప్రతిష్ట వేడుకల్లో అందరూ పాల్గొనేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Also Read.. అయోధ్యకు శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు
ఇదిలా ఉండగా.. ఆయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా సహా పలు రాష్ట్రాలు సైతం ఆరోజున పబ్లిక్ హాలిడే ప్రకటించాయి.