తిరుమల: అయోధ్యలో ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుక జరుగనున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పంపే లక్ష లడ్డూల (ఒక్కోటి 25 గ్రాములు) ఫ్యాకింగ్ గురువారం ప్రారంభమైంది.
Also Read.. చరిత్ర సృష్టించే అవకాశాన్ని తృటిలో కోల్పోయిన నాగల్!
తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తంగా 350 బాక్సులను అయోధ్యకు తరలించేందకు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్ తెలిపారు.