Saturday, May 4, 2024

రాహుల్, రేవంత్, బండి.. ముగ్గురిని ఉతికారేసిన కేటీఆర్..!

spot_img

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో అదానీ గ్రూపును బీజేపీ బినామీ అని ఒకవైపు రాహుల్ గాంధీ నిందలు వేస్తుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదానీని ఆలింగనం చేసుకుంటున్నాడని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కెటిఆర్) అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో క్యాడర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు లోక్ సభ ఎన్నికల కోసం కలిసిపోయాయన్నారు.

‘ఇప్పటికే బండి సంజయ్ ఈ విషయంపై బాహాటంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ని బొందపెట్టాలని అంటున్నాడు. అంటే లోపాయికారిగా ఒప్పందం అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ చెప్తున్నట్టు.. బీజేపీ బినామీ అయిన అదానీతో కలిసిపోయాడు. ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడించడానికి రేవంత్, బండి సంజయ్ అనైతికి రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నాడు కేటీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసిన కేసీఆర్ ముందు నడవవు. ఇప్పటికే కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles