Saturday, May 18, 2024

ప్రాణం పోయినా పార్టీ మారను

spot_img

హనుమకొండ : పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పందించారు. ఆ వార్తలన్ని అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు.  పార్టీలు మారే చరిత్ర తనది కాదన్నారు. అలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని, ప్రాణం పోయినా పార్టీ మారనని స్పష్టం చేశారు.

Also Read.. ప్రయాణికుడి చెంపపై కొట్టిన టీటీఈ సస్పెండ్‌

హన్మకొండ ప్రశాంత్ నగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. 2012 లో ప్రజా రాజ్యం పార్టీ విలీనం తర్వాత ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు గుర్తుచేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని కొంతమంది తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Latest News

More Articles