నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్/ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నవారు, మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ తదితర డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఏప్రిల్ 1,2023 నాటికి వయసు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలని సూచించింది. వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్-200, జనరల్- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్సీ కోటాలో వీఐ-20, హెచ్ఐ-36, ఎల్డీ-20, డీ అండ్ ఈఈ-36 పోస్టులను కేటాయించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 27లోగా సమర్పించాలి. ప్రారంభ వేతనం రూ.41,960గా నిర్ణయించారు.