Saturday, May 18, 2024

హైదరాబాద్‎లో రూ. 30 కోట్ల ఇల్లు కబ్జా చేసిన హీరోయిన్ పై కేసు నమోదు

spot_img

ఏ రౌడీలో, గుండాలో, కబ్జాలకు పాల్పడటం చూశాం. కానీ, ఇక్కడ ఓ హీరోయిన్ కోట్ల విలువైన ఇంటి కబ్జాకు ప్రయత్నించింది. అమెరికాకు చెందిన ఒక మహిళకు జూబ్లీహిల్స్‎లో రూ. 30 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ఈ ఇంటికి సంబంధించిన లీజు కేసు కోర్టులో నడుస్తోంది. ఇదే కేసు విషయంగా నటి, బిగ్ బాస్ ఫేమ్ స్వాతి దీక్షిత్‎కు, ఆ ఇంటి యజమానురాలికి ఏడాది కాలంగా గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరులేని సమయంలో కొంతమంది దుండగులను వెంటపెట్టుకొని స్వాతి దీక్షిత్, చింతల ప్రశాంత్‎లు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వాచ్ మెన్‎ను బెదరించి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన వాచ్ మెన్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. స్వాతితో పాటు మరో 20 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read Also: కాటేసిన పామును కూడా ఆస్పత్రికి పట్టుకొచ్చిన యువకుడు

స్వాతి దీక్షిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించి మెప్పించింది. ఆ తరువాత 2012లో బెంగాలీలో తోర్ నామ్ సినిమాలో తొలిసారి హీరోయిన్‎గా నటించింది. తెలుగులో దెయ్యం, జంప్ జిలాని, గమ్మత్తు లాంటి సినిమాల్లో కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‎గా కూడా పాల్గొంది.

Latest News

More Articles