Friday, May 17, 2024

టిఫిన్ పెట్టలేదని తల్లిని కొట్టి చంపిన మైనర్ బాలుడు

spot_img

కనీ పెంచిన తల్లిని ఓ కొడుకు కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని ముల్‌బాగల్ పట్టణంలో శనివారం ఉదయం జరిగింది. స్థానికంగా నివసించే మైనర్ బాలుడు శనివారం ఉదయం స్కూల్ కు వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆ సమయంలో తన తల్లిని టిఫిన్ పెట్టాల్సిందిగా అడిగాడు. కానీ, ఆమె టిఫిన్ పెట్టడానికి నిరాకరించడమే కాకుండా.. నువ్వు నా కొడుకువు కాదు అంది. దాంతో కోపోద్రిక్తుడైన ఆ బాలుడు.. పక్కనే ఉన్న ఐరన్ రాడ్ తీసుకొని ఆమె తల మీద కొట్టాడు. తీవ్ర గాయమైన ఆమె.. బాలుడి కళ్ల ముందే చనిపోయింది. భయపడిన బాలుడు దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పాడు. కంగారుపడిన పోలీసులు.. వెంటనే బాలుడి ఇంటికి వెళ్లి చూడగా.. అతని తల్లి రక్తపుమడుగులో పడి ఉంది. ఘటనస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలుడిని జువైనల్ హోమ్‎కు తరలించారు.‎

Read Also: హైదరాబాద్ బుక్ ఫెయిర్‎కు ‘గద్దర్ ప్రాంగణం’గా నామకరణం

Latest News

More Articles