Thursday, May 2, 2024

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్, స్వైన్ ఫ్లూ

spot_img

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది.ఇప్పటికీ అక్కడక్కడ కేసులు బయట పడుతూనే ఉన్నాయి. కరోనా బారి నడుతూనే ఉన్నారు. తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా స్వయంగా తెలిపారు. కొన్ని రోజులుగా తాను జ్వరంతో బాధపడుతున్నానని… డాక్టర్ల సలహాతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… టెస్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని తెలిపారు. కరోనాతో పాటు స్వైన్ ఫ్లూ కూడా ఉందని చెప్పారు. కరోనా కారణంగా తాను రానున్న 7 రోజుల పాటు ఇంట్లోనే ఉంటానని… ఎవరినీ కలవబోనని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినా స్పందించని సీఎం

Latest News

More Articles