కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్. అంతేకాదు …బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా సీఎం రేవంత్ రెడ్డి స్పందింకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి వ్యతరేకంగా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు పణంగా పెడుతున్నారని నిలదీశారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దీనికి సంబంధి సోషల్ మీడియా ఎక్స్( ట్విట్టర్) లో పోస్ట్ చేశారు కేటీఆర్.
https://twitter.com/KTRBRS/status/1753609566544417192