Tuesday, May 7, 2024

కాంగ్రెస్ 50 రోజుల్లో 50 వేషాలు వేసింది.. కాంగ్రెస్ ఉన్నా లేనట్టే

spot_img

కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన ఈ రోజు జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్‎తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘కొండగట్టు అంజన్న దర్శన భాగ్యం అదృష్టంగా భావిస్తున్నాను. ఆంజనేయ స్వామి, కేసీఆర్ ఆశీస్సులతో గతంలో మంత్రినయ్యా, ఇప్పుడు ఎమ్మెల్యేనయ్యా. దేవాలయాల అభివృద్ధి ఘనత కేసీఆర్‎దే. దేశంలోనే ప్రసిద్ధ క్షేత్రం కొండగట్టు దేవస్థానానికి కేసీఆర్ రూ. 100 కోట్లు ఇచ్చారు. పార్లమెంట్ స్థానాలు 16కు 16 గెలవాలని స్వామి వారిని కోరుకున్నా. కాంగ్రెస్ పాలన ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే. కాంగ్రెస్ ఉన్నా లేనట్టే. కాంగ్రెస్ 50 రోజుల్లో 50 వేషాలు వేసింది. ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ న్యాయం చేయలేదు.. చేయదు కూడా’ అని మల్లారెడ్డి అన్నారు.

Read Also: తెలంగాణ మలి దశ అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

Latest News

More Articles