Sunday, May 19, 2024

ఈనెల 12న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా

spot_img

తెలంగాణ మలి దశ అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు నాపైన, భారత జాగృతి సంస్ధ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నిన్న ఇంద్రవెల్లిలో జరిగిన కాంగ్రెస్ సభకు ప్రభుత్వం నిధులు ఉపయోగించారు. ఉదయం పార్టీ పరమైన కార్యక్రమాలు ఇంద్రవెల్లిలో చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రభుత్వానికి ఫీజు చెల్లించారో లేదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. తెలంగాణ మలి దశ అమరవీరుల కుటుంబాలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. గ్యాస్ సిలిండర్ ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రియాంక గాంధీని పిలుస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తారు? ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ సర్పంచ్‎గా కూడా గెలవలేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ వస్తే నల్ల బుగ్గలు ఎగురవేసి నిరసనలు తెలుపుతాం.

Read Also: జూమ్ మీటింగ్‎లో చూసి అమెరికా నుంచి వచ్చి మహిళా ఉద్యోగిని వేధించిన సీఈఓ

వారానికి రెండు రోజులు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ప్రభుత్వ ప్రకటనలు ఉండవని చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం కాగానే భారీ ప్రకటనలు ఇస్తూ ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ మైనారిటీలో పడ్డా.. ఆ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తీసుకువచ్చి సపర్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారు. రేవంత్ రెడ్డిని యూ టర్న్ ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారు. ప్రజల వద్దకు పాలన పోవాలని కేసీఆర్ చిన్న జిల్లాలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పైగా కేసీఆర్ కుటుంబం అంటూ రేవంత్ రెడ్డి పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున 22 కుటుంబాలకు చెందిన వారు ఎన్నికల్లో పోటీ చేశారు. కాన్వాయ్ అవసరం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి పెద్ద కాన్వాయ్‎లో తిరుగుతున్నారు. సోనియా గాంధీ కాళ్ళు మొక్కడం తప్ప జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి అనలేదు. తెలంగాణ అమరవీరులకు రేవంత్ రెడ్డి నివాళులు అర్పించలేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.

పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అడగలేదు. ఇప్పుడు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెడతారా లేదో సమాధానం చెప్పాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. బీజేపీకి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన నియామకాల్లో ఎస్సీల, బీసీల వాటా ఎంత సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 24 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. పూలే విగ్రహం అసెంబ్లీలో పెడితే లాభం జరిగేది బీసీలకే. బీసీలకు ప్రాతినిధ్యం ఇస్తే లాభపడేది కాంగ్రెస్ పార్టీలో వున్న బీసీ నాయకులే. మహిళా రిజర్వేషన్ల అంశంలో భారత జాగృతి 14 పార్టీలను ఆహ్వానించింది. ఇప్పుడు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేసే అంశంలో అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తాం. రేవంత్ రెడ్డి ముఠా మేస్త్రీలాగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీని మేము పడగొట్టాల్సిన అవసరం లేదు. నల్గొండ, ఖమ్మం నాయకులే రేవంత్ రెడ్డిని పడగొడతారు. పార్టీ డిసైడ్ చేస్తే ఎంపీగా పోటీ చేస్తాను. అందరి ముందే కంచె ఐలయ్యతో మాట్లాడాను. 16 మంది ప్రొఫెసర్లను రౌండ్ టేబుల్ సమావేశానికి పిలిచాం. కంచె ఐలయ్య రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి అలా సభలో మాట్లాడారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు చేయాలని ఈనెల 12న భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపడుతాం’  అని కవిత తెలిపారు.

Latest News

More Articles