Tuesday, May 7, 2024

అద్వానీ గురించి ఆ వ్యాఖ్యలు చేస్తూ మోడీ కన్నీళ్లు

spot_img

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎమోషనల్ అయ్యారు. “ఆయనకు భారతరత్న ప్రదానం చేయడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్” అని ప్రధాని మోడీ తన అధికారిక X ఖాతాలో చెప్పారు. భారతరత్న అవార్డు రావటాన్ని ప్రకటిస్తూ.. అద్వానీతో ఉన్న రెండు చిత్రాలను ట్యాగ్ చేశారు మోడీ.
తాను అద్వానీతో మాట్లాడానని.. ఈ గౌరవం లభించినందుకు అభినందనలు తెలిపానని ప్రధాని తెలిపారు.

“మన కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో ఒకరు అద్వానీ. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో పనిచేయడం నుండి మన ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైంది” అని పిఎం మోడీ కామెంట్స్ చేశారు. ఆయన మన హోం మంత్రిగా, I&B మంత్రిగా కూడా గుర్తింపు పొందాడు.
ప్రజా జీవితంలో అద్వానీ జీ దశాబ్దాల సుదీర్ఘ సేవ, పారదర్శకత, సమగ్రత, తిరుగులేని నిబద్ధత, అసమానమైన కృషితో పని చేశారని ప్రధాని మోదీ అన్నారు.

Latest News

More Articles