హైదరాబాద్: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రజాస్వామ్య భారత్ ఆవిర్భవించి 75 ఏండ్లవుతున్నదని, భవిష్యత్తులో మన దేశం అన్ని రంగాల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులు దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Also.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నయీ రోష్నీ పథకంతో మహిళలకు నెలకు లక్షల్లో ఆదాయం…