Friday, May 3, 2024

మెగాస్టార్‌ చిరంజీవికి అభినందనలు..!

spot_img

భారత ప్రభుత్వం చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసిందన్న వార్తను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కూడా తన సంతోషాన్ని పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాత దిల్ రాజులు మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ మెగాస్టార్‌కు పుష్పగుచ్ఛం అందించారు.

ఈ కార్యక్రమంలో నటుడు రాజా రవీంద్ర కూడా పాల్గొన్నారు. ఉత్తమ నటుడైన చిరంజీవి పద్మ విభూషణ్‌ అవార్డు పొందడం గర్వకారణమని, భవిష్యత్తులో ‘భారతరత్న’ కూడా రావాలని ఆకాంక్షించారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం ‘విశ్వంభర’ వరకు విజయవంతంగా సాగుతుందన్నారు. రక్తదానం, నేత్రదానం వంటి కార్యక్రమాల ద్వారా కోట్లాదిమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మంత్రి కోమటిరెడ్డితోపాటు ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ చాంబర్ అధ్యక్షులు దిల్‌ రాజు కూడా ఉన్నారు.

Latest News

More Articles