మంచిర్యాల : రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. వికలాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ ను రూ.1000 పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు.
‘‘తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వికలాంగులకు ఇప్పుడు ఇస్తున్న రూ. 3,116 పెన్షన్ ను మరో రూ. 1000 పెంచి వచ్చే నెల నుంచి అందిస్తాం. మంచిర్యాల గడ్డ నుంచి నుంచి ఈ విషయాన్ని ప్రకటించాలనే ఇప్పటిదాకా సస్పెన్షన్లో పెట్టాను. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పెన్షన్ అందుతుంది. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు.