Monday, May 20, 2024

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న..TSRTC ఉద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త

spot_img

సీఎం కేసీఆర్ TSRTCకి ఇచ్చిన ఖచ్చితమైన హామీలను ఈ రోజు కాసేపటి క్రితమే నెరవేర్చినట్లు తెలియచేసి ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురును అందించారు. దసరాకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కానుకను అందిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 4 .85 శాతం తో డీఏ ను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం.

ఇక ఇది మాత్రమే కాకుండా అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనంతో కలిపి డీఏ చెల్లించనున్నట్లు TSRTC తెలపడం విశేషం. ఇంతకు ముందు వరకు ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విధంగా పెండింగ్ లో ఉన్న మొత్తం 9 డీఏ లను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ వీరికి మాట ఇచ్చిన విధంగా నిలబెట్టుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున ఇది ఆర్టీసీ ఉద్యోగులకు దసరా కానుకా అంటూ ప్రకటించడం విశేషం.

Latest News

More Articles