హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు శుక్రవారం నిర్వహించిన తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయింది. సర్జరీ చికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడించారు.
Also Read.. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడుతున్నారా?బీకేర్ ఫుల్ ..ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు..!!
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, ఎంపీ సంతోశ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
Also Read.. శనివారం ఈ పని చేస్తే శని ఒదలడం గ్యారెంటీ..!!
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున దవాఖానకు తరలివచ్చారు. నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎవరూ దవాఖానకు రావొద్దని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు కోరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని చెప్పారు.