హైదరాబాద్: రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్షేమంగా ఉన్నారు. కర్నూలులో ఆత్మకూరు దగ్గర సురేందర్ని కిడ్నాపర్ల చెర నుంచి పోలీసులు రక్షించారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. కిడ్నాపర్ల కోసం నల్లమలలో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read.. ధరణి ఉంటదా? ఉండదా? కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు ఆదేశం
కాగా, సురేందర్ను కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రాయదుర్గం నుంచి సురేందర్ను కారులో నల్లమల అడవులకు కిడ్నాపర్లు తీసుకెళ్లినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వదిలిపెట్టాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని సురేందర్ భార్యకు ఫోన్ చేసి కాడ్నాపర్లు బెదిరించారు.