Saturday, May 18, 2024

కిరెన్ రిజుజును న్యాయశాఖ బాధ్యతల నుంచి తప్పించిన మోడీ సర్కార్

spot_img

హైదరాబాద్: కేంద్ర కేబినెట్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రమంత్రి కిరెన్ రిజుజు ను న్యాయశాఖ బాధ్యతల నుంచి మోడీ సర్కార్ తొలగించింది. నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది. స్వతంత్ర హోదాతో అర్జున్ రామ్ మేఘవాల్ కు న్యాయశాఖ బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. కాగా, కిరెన్ రిజుజుకు భూవిజ్ఞానశాస్త్ర మంత్రిత్వ శాఖను కేటాయించారు.

Latest News

More Articles