హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ఇంట్లో బెంగళూరు టీం సభ్యులు సందడి చేశారు. గురువారం ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ జట్టుతో ఆర్సీబీ తలపడనున్నది.
హైదరాబాద్ చేరుకున్న ఆర్సీబీ జట్టు సభ్యులు .. సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లో సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు. కోహ్లీతో పాటు డూప్లెసిస్, వెయిన్ పార్నెల్, కేదార్ జాదవ్లు సిరాజ్ ఇంట్లో విందుకు హాజరయ్యారు.
ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న సిరాజ్.. ఐపీఎల్ 2023 సీజన్ లో మంచి ఊపుమీదున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడిన సిరాజ్.. 16 వికెట్లు తీసి టాప్ ఫామ్లో ఉన్నాడు.
పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆర్సీబీ 12 పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది. సన్రైజర్స్తో జరిగే మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీకి ప్లేఆఫ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Virat Kohli And RCB team visited Siraj New House Opening In Film Nagar Jubilee Hills , HYD ❤️🔥❤️❤️#ViratKohli #Siraj #RCB #RoyalChallengersBangalore #RCBvsSRH @mufaddal_vohra @CricCrazyJohns @imVkohli pic.twitter.com/8DOzAR56c6
— Tarak Anna || Anil 🖤 (@AnilTarakianNTR) May 15, 2023