చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం సందర్భంగా రికార్డు ఆదాయం వచ్చింది. ఆర్జీత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. శనివారం రూ.11,84,726, ఆదివారం రూ.47,82,420, సోమవారం రూ.10,55,161 ఆదాయం వచ్చిందని తెలిపారు. అయితే, గత సంవత్సరం పట్నం వారానికి రూ. 49,83,819 ఆదాయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఉత్సవాల సందర్భంగా స్వామి వారి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ఈవో తెలిపారు.
Also Read.. ఫిబ్రవరి నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్!