రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశవ్ నగర్ కాలనీలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చామంతి (26), శేఖర్ (25) అనే ఇద్దరు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చామంతికి దూరపు బంధువైన శేఖర్ తమ్ముడి వరుస అవుతాడు. తన ఇంట్లోకి వచ్చి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారని కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు. ఆత్మహత్య వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు.