జగిత్యాల : బీజేపీకి ఓటు వేయమని, తాము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్న పద్మశాలి నాయకులు బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ కు కోరుట్ల పద్మశాలి నాయకులు అల్టిమేటం జారీ చేశారు. మెట్ పెల్లి పట్టణంలోని పద్మశాలి ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు.
Also Read.. సునీతా లక్ష్మారెడ్డికి బీ-ఫామ్.. ఏ నియోజిక వర్గమో తెలుసా ?
మెజార్టీ ఉన్న పద్మశాలి కులానికి చెందిన నాయకుని కాదని వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తికి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. స్థానికులను కాదని ఎంపీ అరవింద్ కు కోరుట్ల టికెట్ కేటాయింపుపై గుర్రుగా ఉన్నారు. స్థానికుడు సాంబారి ప్రభాకర్ కు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1 వ తేదీన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.