Monday, May 20, 2024

రేవంత్ రెడ్డికి సంస్కారం నేర్పించండి

spot_img

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి జానారెడ్డి సంస్కారం నేర్పాలని.. కేసీఆర్‌కు పిండం పెట్టాలనుప్పుడు ఆయన సంస్కారం ఎక్కడికి పోయిందంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ జల విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిలు, వార్‌రూమ్‌ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌ తీరుపై ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ నేతల వద్ద సంస్కారం నేర్చుకోవాలని దుస్థితి తమకు పట్టలేదని, రూ.50 కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే టికెట్ల కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆ పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల కంటే బీఆర్‌ఎస్‌ అధిక స్థానాలు గెలుస్తుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ సీఎం  అవుతారని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.

Latest News

More Articles