Saturday, May 18, 2024

కేసీఆర్ రక్తాన్ని రంగరించారు.. కేటీఆర్ ఎమోషనల్

spot_img

వరంగల్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి పార్టీ శ్రేణులని ఉద్దేశించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ప్రజల్ని వంచించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇంకా మొదలు కాలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ రక్తాన్ని రంగరించారని, చెమటను ధారపోసారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఇప్పటికే కొన్నిటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు.

నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదిక అబద్ధం చెప్పారు అని కేటీఆర్ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వాళ్ళ 420 హామీలతో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ నెల రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత మొదలైంది అన్నారు. కేటీఆర్ సీఎం జిల్లాలు రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని కేటీఆర్ అన్నారు.

Latest News

More Articles