Saturday, May 18, 2024

మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభను పరామర్శించిన కేటీఆర్

spot_img

కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ భర్త గాలన్న ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు శోభ స్వగ్రామం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శోభ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ వెంట కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీష్ బాబు, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Read also; ఓటీటీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘స‌లార్’

Latest News

More Articles