హైదరాబాద్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్, ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి… అదానీ చేతుల్లో బీజేపీ స్టీరింగ్.. అమిత్ షా కు కౌంటర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.