Saturday, May 4, 2024

కాంగ్రెస్ తీరుతో తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం

spot_img

తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సంక్షోభం నెల‌కొంద‌ని.. ఇది బాధాక‌ర‌మైన ప‌రిస్థితి అని తెలిపారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాలుగు నెల‌ల్లోనే రైతుల‌కు ఇలాంటి దుస్థితి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కారే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన రైతుదీక్ష‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

ఎర్ర‌టి ఎండ‌ల్లో కేసీఆర్ రైతుల ద‌గ్గ‌రికి వెళ్లి భ‌రోసా ఇచ్చారు. కేసీఆర్ బాట‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు దీక్ష‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు న‌మ్మి ప్ర‌జ‌లు మోస‌పోయారు. పాలిచ్చే బ‌ర్రెను పంపించి దున్న‌పోతును తెచ్చుకున్నామ‌ని ప్ర‌జ‌లు ఆవేద‌న చెందుతున్నారు. ఎల‌క్ష‌న్ కోడ్ వ‌చ్చింద‌ని సీఎం, మంత్రులు చావుక‌బురు చెబుతున్నారు. పాల‌న త‌న చేతుల్లో లేద‌ని సీఎం రేవంత్ అన‌డం సిగ్గు చేటు. రేవంత్‌కు చిత్త‌శుద్ధి ఉంటే రైతులు ముందుకు రావాలి. పంట‌ల‌కు బోన‌స్ ఇస్తామ‌ని ఈసీకి రేవంత్ లేఖ రాయాలి. మేం కూడా మ‌ద్ద‌తిస్తాం.. మీ తీరుగా ఎక్క‌డా అడ్డుకోం. పంట‌ల‌కు క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇవ్వాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మంత్రుల‌కు తెలివుందా.. లేదా..? వ‌ర్షాలు ఎక్కువ ప‌డి పంట‌లు మునిగిపోయాయ‌ని మంత్రి శ్రీధ‌ర్ బాబు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు వ‌ర్షాలు ప‌డ‌లేద‌ని శ్రీధ‌ర్ బాబు అంటున్నారు. ఎన్నిక‌ల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టాం. రైతుబంధు ఇవ్వొద్ద‌ని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ ఆపింది. రైతు బంధు కోసం పెట్టిన డ‌బ్బులు ఏమ‌య్యాయో చెప్పాలి. తెలంగాణ‌కు నీళ్లు రావాలంటే ఎత్తిపోత‌లే మార్గం. అందుకే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల‌, ఎల్లంప‌ల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావ‌రి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావ‌రిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్ర‌టి ఎండ‌ల్లో కూడా చెరువులు మ‌త్త‌ళ్లు దుంకిన‌య్. ఇది కాలం తెచ్చిన క‌రువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన క‌రువు. 300 పిల్ల‌ర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్ల‌ర్లు కుంగిన‌య్. కేసీఆర్‌ను బ‌ద్నాం చేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తుంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింద‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నారు. యూట్యూబ్‌లో వ‌చ్చే త‌ప్పుడు వార్త‌లు చూసి ఆగం కావొద్దు. కేసీఆర్ వస్తున్నార‌ని అన్నారం, సుందిళ్ల నీళ్లు వ‌దిలారు. హ‌రీశ్‌రావు హెచ్చ‌రిస్తే కూడ‌వెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వ‌లేద‌ని అర్థ‌మైంది క‌దా..! అని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింది. డిసెంబ‌ర్ 9న రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తామ‌ని మోసం చేశారు. రుణ‌మాఫీని సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్ద‌ని రేవంత్ అంటున్నారు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామ‌ని కాంగ్రెస్ మోసం చేసింది. వ‌రికి క్వింటాల్‌కు రూ. 500 బోన‌స్ ఇస్తామ‌ని ఇవ్వ‌డం లేదు. రుణ‌మాఫీ అయినోళ్లు, బోన‌స్ వ‌చ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయండి. కాంగ్రెస్ మోసాలు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పాలి. కృష్ణాన‌ది ప్రాంతంలో కూడా క‌రువు ప‌రిస్థితులు వ‌చ్చాయి. సాగ‌ర్‌లో నీళ్లున్నా కూడా పంట‌ల‌కు నీళ్లు ఇవ్వ‌లేదు. మిష‌న్ భ‌గీర‌థ అప్ప‌గించినా నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్‌కు లేదు. వండిన అన్నం వ‌డ్డించే తెలివి కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి లేదని కేటీఆర్ విమర్శించారు.

ప్ర‌తి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రూ. 500 బోన‌స్‌పై నిల‌దీద్దాం. ఎల‌క్ష‌న్ కోడ్ ఉందంటే అయిపోయినంక ఇస్తామ‌ని రేవంత్ మాటివ్వాలి. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. ప్ర‌భుత్వాన్ని కూల‌గొడుతామ‌ని రేవంత్ రెడ్డి ఆగ‌మాగం అవుతున్నాడు. రేవంత్ మొగోడైతే రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయాలి. రూ. 500 బోన‌స్ ఇవ్వాలి. ఆస‌రా పెన్ష‌న్ రూ. 4 వేలు ఇవ్వాలి. ఆడ‌బిడ్డ‌ల‌కు నెలకు రూ. 2,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

ఇది కూడా చదవండి: జైలుకైనా పోతా.. కానీ పార్టీ మారను

Latest News

More Articles