Saturday, May 18, 2024

కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు

spot_img

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను KRMBకి అప్పజెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్లో మీడీయాతో మాట్లాడారు కేటీఆర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఛలో నల్లగొండ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కృష్ణానది బేసిన్ లో ఉన్న హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని గౌరవ ప్రతినిధులతోని సమావేశం పెట్టుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నెల 13న ఛలో నల్గొండ సభను విజయవంతం చేయడం పై కృష్ణ బాసిన్ లో ఉండే జిల్లాల ప్రజలు, నాయకులూ కదిలి రావాలి. ఎవరైనా మా పార్టీ నుంచి వెళ్తారు అంటే దానిపైన మేము చేసేది ఏం లేదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. ఆ ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లొచ్చు.. చూసి నేర్చుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని బరాజులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్ హౌస్ లు ఉన్నాయనే అంశాలను కాంగ్రెస్ తెలుసుకోవచ్చన్నారు.

కానీ కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదన్నారు కేటీఆర్. మేడిగడ్డ కట్టిందే కేసీఆర్. కాళేశ్వరంలో వారికీ ఓనమాలు కూడా తెలవదు. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్. కాళేశ్వరం కట్టిందే మేము …కాళేశ్వరం గురించి  కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియకపోతే తెలుసుకోవచ్చు. కాలేశ్వరం కట్టిందే మేము అయినప్పుడు చూడాల్సింది మేము కాదు… కాంగ్రెస్ పార్టీనే. కాళేశ్వరం ద్వారా వచ్చిన నీటితో పండించిన పంటల సహాయంతోనే ఈరోజు దేశానికి తెలంగాణ ధాన్యాదారంగా నిలుస్తోంది.. దేశానికి అన్నపూర్ణగా మారింది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విజయం గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్.

ప్రాజెక్టులో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే  ప్రభుత్వం సరిచేయాలి… ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉంది. మేడిగడ్డ దగ్గర జరిగిన ఇబ్బందిని పట్టుకొని మెత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే.. అది సూర్యుడి మీద ఉమ్మేసినట్లేనని అన్నారు కేటీఆర్. రాజకీయ దురుద్దేశంతో అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు అపవాదుకి గురిచేసి భ్రష్టు పట్టించాలని చూస్తే అది కాంగ్రెస్ అమాయకత్వమన్నారు. ఎక్కడైనా తప్పులు జరిగితే బయటపెట్టండి… ఏ విచారణకైనా సిద్ధమని గతంలోని పదుల సార్లు చెప్పామన్నారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంది.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు మాట్లాడుతున్నారు… కేవలం బట్ట కాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు, అడ్డగోలుగా భాద్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తినే ఒక క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. ఆయనకు క్రిమినల్ ఆలోచనలు తప్ప ఇంకొకటి లేదు. ఆయన ఎవరిపైన నా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.. అధికారం ఆయన చేతిలో ఉంది.. ఎవరిపైన అయినా నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటోంది

Latest News

More Articles